Connect with us

Featured

శ్రీదేవి ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్స్.. కాని 1990 తరువాత ఆమెకు కలిసిరాని తెలుగు చిత్రాలు.!!

Published

on

అందానికి నిర్వచనం శ్రీదేవి.. అభినయానికి నిదర్శనం శ్రీదేవి.. బాలనటిగా మొదలైన ఆమె ప్రస్థానం.. అంచలంచలుగా అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్న అతికొద్ది కథానాయికల్లో శ్రీదేవి ఒకరు. కాలం కలిసి రావడమో లేదా శ్రీదేవి అందం,అభినయమో.. మొత్తానికి ఆమె తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు.

1980 దశకంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలతో తీరికలేని సమయాన్ని గడిపారు. అలాంటి శ్రీదేవి 1990 దశకం వచ్చేసరికి హిందీ చిత్రాలు చేస్తున్నారు. ఆ క్రమంలో తెలుగు లో కొన్ని చిత్రాల్లో ఆమె నటించారు. అయితే అవి బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడాయో చూద్దాం. 1991 దుర్గా ఆర్ట్స్, కె.ఎల్.నారాయణ నిర్మాణం, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘క్షణక్షణం’ చిత్రం విడుదలైంది. తెలుగులో శివ చిత్రం తర్వాత రాంగోపాల్ వర్మకు క్షణక్షణం రెండవ చిత్రం. వర్మ కాలేజీ రోజుల్లో ఉండగానే శ్రీదేవి కి వీరాభిమాని.శ్రీదేవితో ఒక సినిమా చేయాలన్న కళ ఆయనకు ‘క్షణ క్షణం’సినిమాతో తీరిపోయింది. విడుదల తొలి విడతలో ఫ్లాప్ ను మూటగట్టుకున్న క్షణక్షణం చిత్రం. మలి విడతలో అబౌ యావరేజ్ గా నిలిచింది.

ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి పోయిన శ్రీదేవి తిరిగి మళ్ళీ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించింది. 1994, వైజయంతి మూవీస్, అశ్వినీదత్ నిర్మాణం, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘గోవిందా గోవిందా’ చిత్రం విడుదలైంది. శ్రీదేవి, నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, అశ్వినీదత్ లాంటి బారి కాంబో లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయం చూసింది. దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీదేవితో తీయాలన్న కళ నెరవేరి నప్పటికీ… ఆమెతో విజయవంతమైన చిత్రాలను రూపొందించలేకపోయాడు. ఈ సినిమా తర్వాత ఆరు నెలల గ్యాప్ లో శ్రీదేవి మరో తెలుగు చిత్రంలో నటించింది. 1994 అల్లు అరవింద్ నిర్మాణం,రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఎస్పీ పరశురామ్ చిత్రం విడుదలైంది. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జోనర్ లో వచ్చిన ఆ సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు.

1994 లో శ్రీదేవి, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ మెంట్ జరగగానే ప్రేక్షకుల్లో ఎక్కడలేని కోలాహలం మొదలైంది. 1994 జూన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఎస్పి పరశురాం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ చిత్రం తర్వాత శ్రీదేవి తెలుగు చిత్రాలకు దూరమయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్ లో అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ.. 2004 దశకం వచ్చేసరికి ఆమె వయసు మీద పడడం, సినిమాలు తగ్గిపోవడం లాంటివి జరిగాయి. 2004 లో ‘మేరీ బీవీ క జవాబు నహీ’ 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్..చిత్రాలు శ్రీదేవికి మంచి పేరును తీసుకువచ్చాయి. దుబాయిలో పెళ్ళికి హాజరవడానికి వెళ్ళిన శ్రీదేవి ప్రమాదవశాత్తు ఆమె బస చేసిన హోటల్ బాత్ టబ్ లో పడి 2018 ఫిబ్రవరిలో మరణించారు.

Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!