Connect with us

Featured

Actress Anthea Maali: హీరోయిన్ కోసం ఆస్తులన్నీ పోగొట్టుకున్న తండ్రి… చివరికి దీన స్థితిలో మరణం.. ఆ హీరోయిన్ ఎవరంటే?

Actress Anthea Maali: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మనకు తెలిసిందే. ఈ సామెత ప్రస్తుత కాలంలో ఉన్న హీరోయిన్లకు కరెక్టుగా

Published

on

Actress Anthea Maali: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మనకు తెలిసిందే. ఈ సామెత ప్రస్తుత కాలంలో ఉన్న హీరోయిన్లకు కరెక్టుగా సరిపోతుంది. హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఏమాత్రం క్లిక్ అయిన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున డబ్బును పోగు చేసుకుంటున్నారు. తరువాత సినిమా అవకాశాలు లేకపోయినా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్న భావనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Actress Anthea Maali: హీరోయిన్ కోసం ఆస్తులన్నీ పోగొట్టుకున్న తండ్రి… చివరికి దీన స్థితిలో మరణం.. ఆ హీరోయిన్ ఎవరంటే?
Actress Anthea Maali: హీరోయిన్ కోసం ఆస్తులన్నీ పోగొట్టుకున్న తండ్రి… చివరికి దీన స్థితిలో మరణం.. ఆ హీరోయిన్ ఎవరంటే?

అయితే ఇలా భవిష్యత్తు పై అవగాహన లేకుండా ఎంతో మంది పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి చివరికి ఉన్న డబ్బులు అన్నింటిని ఖర్చు చేసుకొని దీన స్థితిలో మరణించిన ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలో ఉన్నారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన వారే ప్రముఖ ఫోటోగ్రాఫర్ జగదీష్ మాలి. జనవరి 18, 1954 లో జన్మించిన ఈయన భారత దేశ వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

Actress Anthea Maali: హీరోయిన్ కోసం ఆస్తులన్నీ పోగొట్టుకున్న తండ్రి… చివరికి దీన స్థితిలో మరణం.. ఆ హీరోయిన్ ఎవరంటే?
Actress Anthea Maali: హీరోయిన్ కోసం ఆస్తులన్నీ పోగొట్టుకున్న తండ్రి… చివరికి దీన స్థితిలో మరణం.. ఆ హీరోయిన్ ఎవరంటే?

ఈ విధంగా ఫోటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు పొందిన జగదీష్ మాలి భారీ మొత్తంలోనే ఆస్తులను పోగు చేశారు. ఇలా ఆస్తిపాస్తులను కూడబెట్టిన ఈయన తన కూతురు అంత్ర మాలిని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈమె తెలుగు హిందీ సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇలా తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ పెద్దఎత్తున ప్రమోషన్ చేయటం కోసం జగదీష్ మాలి తన ఆస్తులన్ని ఖర్చు చేశారు.ఇలా కూతురి కోసం సంపాదించిన ఆస్తుల మొత్తం ఖర్చు చేసి చివరికి అనారోగ్యం పాలై హాస్పిటల్లో దీన స్థితిలో ఉన్నారు. ఇలా దీనస్థితిలో బతుకుతున్న ఈయనకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆర్థిక సహాయం చేశారు.

Advertisement

సర్వస్వం పోగొట్టుకున్న తండ్రి..

ఇలా ఆర్థిక సహాయం చేసినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. కూతురి కోసం తన సర్వస్వం పోగొట్టుకున్న జగదీష్ చివరి రోజులలో తన కూతురు అంత్ర మాలి ప‌ట్టించుకోలేద‌న్న ప్రచారం జరిగింది. ఇలా కూతురి కోసం సర్వస్వం పోగొట్టుకున్న ఆ తండ్రి చివరికి దీన స్థితిలో మరణించారు.

Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!