Connect with us

General News

నిద్రిస్తున్న ప్రియురాలి అకౌంట్ నుంచి రూ.18 లక్షలు ఎలా కాజేశాడో చూడండి.. ఇది నిజంగా వండరే..

బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. ఒకప్పుడు డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే.. క్యూలో నిల్చొని.. గంటలు గంటలు

Published

on

బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. ఒకప్పుడు డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే.. క్యూలో నిల్చొని.. గంటలు గంటలు నిలబడి.. చివరికి పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే సరికి చాలా సమయం పట్టేది. అంతే డబ్బుల తీసుకోవాలన్నా ఇదే ప్రాసెస్. తర్వాత రోజులు మారాయి. ఏటీఎం సెంటర్లు వచ్చాయి.

Advertisement

వాటి నుంచి మొదట సులభంగా డబ్బులను తీసుకునే వెసులుబాటును కల్పించాయి. తర్వాత ఏటీఎం మెషిన్లలో కూడా డిపాటిజ్ సౌకర్యాన్ని తీసుకొచ్చి.. బ్యాంక్ సేవలను వినియోగదారుడికి ఇంకాస్త దగ్గరగా తీసుకొచ్చాయి. ఇక మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016లో పెద్ద నోట్లను రద్దు చేసి..ఎక్కువగా డిజిటల్ కరెన్సీ వైపు మొగ్గు చూపే విధంగా చేశాడు. అప్పటి నుంచి డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. దీనికి తోటు డిజిటల్ ప్లాట్ ఫాంలు అయిన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి వాటికి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక అకౌంట్ నుంచి డబ్బులను మరో అకౌంట్ ని ట్రాన్స్ ఫర్ చేయడం అనేది మరింత సులువు అయిపోయింది.

అయితే ఇలా డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసే ఏ యాప్ కు అయినా సెక్యూరిటీ అనేది ఉంటుంది. కొంతమంది మొబైల్ లో పాస్ వర్ట్ పెడుతుంటే.. మరికొంతమది ఫింగర్ ఫ్రింట్.. మరికొంత మంది ఫేస్ రికగ్నైజ్ లాంటివి ఉపయోగిస్తున్నారు. అయితే వీటి వల్ల కూడా సైబర్ నేరాలు చాలా జరిగాయి. ఇక పోతే తాజాగా జరిగిన ఘటనలో ఓ ప్రియురాలి.. ఫోన్ తీసుకున్న ప్రియుడు.. ఆమె మొబైల్ నుంచి దాదాపు రూ.18 లక్షలు కాజేశారు. ఇదెలా సాధ్యం అయిందంటే.. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమె ఫోన్ తీసుకున్నాడు.

అందులో వివిధ రకాల యాప్ లను చెక్ చేస్తుండగా.. అందులో ఆమె బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన యాప్ ని ఓపెన్ చేయగా.. అందులో అమౌంట్ చూసి షాక్ అయ్యాడు. రూ.18లక్షలు అకౌంట్లో ఉండగా చూసి.. దానిని ఎలాగైనా కొట్టేయాలని ఆలోచించాడు. దానికి ఆ యాప్ ఓపెన్ చేసి.. ట్రాన్సాక్షన్ సమయంలో ఫేస్ రికగ్నైజ్ కు నిద్రిస్తున్న ఆమె వద్దకు వెళ్లి.. ముఖానికి ఎదురుగా ఫోన్ ఉంచాడు. తర్వాత ఆమె కనురెప్పలను పైకి ఉంచి లాక్ తీశాడు. ఆ అకౌంట్ నుంచి రూ.18లక్షలు కాజేశాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

General News

ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Published

on

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.

జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.

Advertisement

ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.

Advertisement
Continue Reading

Featured

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!

Published

on

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున 4:50 నిమిషాలకు కన్నుమూశారు.

శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

ఒక రామోజీరావు మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ అటు మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మీడియా రంగానికి ఎన్నో సేవలు చేసిన రామోజీరావు మరణ వార్త తెలిసి ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో తెలుగుదేశం అధినేతలు మరణం వార్తపై సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

అనారోగ్యంతో కన్నుమూత..

రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈయన రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా పత్రిక రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు కూడా స్పందిస్తున్నారు.

Advertisement

Continue Reading

Featured

బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు

Published

on

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అడ్డదారుల తొక్కుతూనే ఉన్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌ కు దిగారు. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నారు. డీజీపీ ఫోటో పెట్టుకొని ఓ అగంతుకుడు ఓ వ్యాపారవేత్త కుమార్తెకు వాట్సాప్ కాల్ చేశాడు. డీపీ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో ఉండటంతో ఆమె అగంతుకుడితో మాట్లాడింది. డ్రగ్స్ కేసు ఆమెను అరెస్ట్ చేస్తున్నామని బెదిరించాడు.

కేసు నుండి తప్పించేందుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కేసు నుంచి ఎవరూ తప్పించలేరని బెదిరించాడు. అయితే.. ఆయన మాట్లాడిన తీరును అనుమానించి ఆ యువతి పోలీసులకు తన తండ్రికి చెప్పింది. ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అడ్డుదారులు తొక్కుతూనే ఉన్నారు. దాని కోసం సమాజంలో పెద్ద వాళ్ల పేర్లు వాడుతున్నారు. ఒక్కోసారి పెద్దవారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు.

Advertisement

Continue Reading
Advertisement

Trending

Don`t copy text!