Connect with us

Featured

Pushpa Movie: పుష్ప ప్రభావం మామూలుగా లేదుగా… రియల్ గా ఎర్రచందనం స్మగ్లింగ్.. చివరికి ఇలా!

Pushpa Movie:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా

Published

on

Pushpa Movie:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా కొంత మంది ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోగా మరికొందరు ఈ సినిమా పై విమర్శలు చేశారు.

Pushpa Movie: పుష్ప ప్రభావం మామూలుగా లేదుగా… రియల్ గా ఎర్రచందనం స్మగ్లింగ్.. చివరికి ఇలా!
Pushpa Movie: పుష్ప ప్రభావం మామూలుగా లేదుగా… రియల్ గా ఎర్రచందనం స్మగ్లింగ్.. చివరికి ఇలా!

ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే ఆ సినిమా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అలాకాకుండా సమాజంలో యువత తప్పు దోవ పట్టించే విధంగా ఉండకూడదని గరికపాటి నరసింహారావు ఈ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో హీరో ఒక స్మగ్లర్ ఆయన కూడా తగ్గేదిలే అంటూ స్మగ్లింగ్ చేస్తారు. ఇలా చేయటం వల్ల సమాజానికి ఏమి తెలియచేస్తున్నారు అంటూ గరికపాటి ఈ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pushpa Movie: పుష్ప ప్రభావం మామూలుగా లేదుగా… రియల్ గా ఎర్రచందనం స్మగ్లింగ్.. చివరికి ఇలా!
Pushpa Movie: పుష్ప ప్రభావం మామూలుగా లేదుగా… రియల్ గా ఎర్రచందనం స్మగ్లింగ్.. చివరికి ఇలా!

ఇలా ఈయన ఈ సినిమా గురించి ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నిజజీవితంలో కూడా ఈ సినిమాను చూసి ఇన్స్పయిర్ అయిన ఒక ట్రక్ డ్రైవర్ ఏకంగా గంధపుచెక్కల స్మగ్లింగ్ చేసిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. యాసిన్ ఇనయితుల్లాఅనే వ్యక్తి ట్రక్కు డ్రైవర్ గా పని చేస్తూ ఇటీవలే పుష్ప సినిమాను చూసిన తర్వాత తాను కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి పథకం వేశాడు.

2 కోట్లు విలువ చేసే ఎర్ర చందనం…

ఆంధ్ర- కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో అతను స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర మార్గమధ్యంలో పోలీసులు అతనిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అతని నుంచి సుమారు 2.45 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా 10 లక్షల వరకు కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఇలా రియల్ గా ఎర్రచందనం స్మగ్లింగ్ జరగడంతో పుష్ప సినిమా ప్రభావం అంటూ ఈ వార్త సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారింది.

Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

డల్లాస్ లో కొత్త సినిమా..
ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు మాత్రమే కాక.. విదేశీయులు అనగా అమెరికన్స్‌, స్పానిష్‌ పీపుల్‌, ఆఫ్రికన్స్‌, యూరోపియన్స్‌, ఏషియన్స్‌, ఇండియన్స్‌.. మరీ ముఖ్యంగా తమిళ్‌, కన్నడ, తెలుగు నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆడిషన్స్ లో కూడా పాల్గొన్నారు. ఇలా అమెరికాలో ఈ సినిమాకి ఇలాంటి ఆదరణ రావడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక విఎన్ ఆదిత్య సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్షకులందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆతృత కనబరుస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!